State Wise Cabinet Ministers: ప్రధాని మోదీ నూతన కేబినెట్లో బీజేపీకి 61, మిత్రపక్షాలకు 11 పదవులు దక్కాయి. రాష్ట్రాల వారిగా చూస్తే.. కేబినెట్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు సర్కార్ పెద్ద పీట వేసింది. ఉత్తర ప్రదేశ్కు 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 6 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. 72 మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది.
ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్త్లు దక్కాయి. ఎల్జేపీ, జేడీఎస్, శివసేన , రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ్, అప్రా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి. మరోవైపు రాష్ట్రాల వారిగా చూస్తే ..కేంద్ర కేబినెట్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు సర్కార్ పెద్ద పీట వేసింది.
80 లోక్సభ స్థానాలున్న యూపీకి 9, బీహర్కు 8 కేంద్ర కేబినెట్ బెర్త్లు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు ఐదేసీ మంత్రి పదవులు వరించాయి. హర్యానా, ఏపీ, తమిళనాడులకు మూడేసి..ఒడిశా, అస్సాం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బెంగాల్, కేరళకు రెండేసి కేంద్ర పదవులు దక్కాయి.
Also Read: Odisha New CM: ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ.. ముఖ్యమంత్రి ప్రస్థానమిదే..!
రాష్ట్రాల వారిగా కేంద్రమంత్రులు: