4 YouTubers Died in Uttar Pradesh Car Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యూట్యూబర్లు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?
అమ్రోహా జిల్లా మనోటా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యూట్యూబర్లు రౌండ్ టు వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నారు. అయితే వీరంతా కారులోని అమ్రోహాలోని హసన్ పూర్లో ఓ ఫంక్షన్కు వెళ్లారు. భోజనం చేసి వీరంతా బయలుదేరారు. ఈ క్రమంలో మనోటా బ్రిడ్జి సమీపం లోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న మరో కారుని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో స్పాట్లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని
మృతులు లక్కీ, సల్మాన్ షారూఖ్, షెహ్నవాజ్గా గుర్తించారు పోలీసులు. వీరంతా కామెడీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.