EPAPER

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!

YSRCP Workers Killed TDP Worker in Kurnool: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతోంది. ఓటమిని అంగీకరించలేని వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికీ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టబోతున్నా.. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా కర్నూల్ జిల్లాలో ఒక టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు.


వైసీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో.. పార్టీ కార్యకర్తను కొడవళ్లతో నరికి హతమార్చారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఈ విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతుడిని టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.

Also Read: Sonakshi Sinha: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే?


ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బొమ్మిరెడ్డి పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. గిరిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్య ఘటనను టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి ఖండించారు. అధికారాన్ని కోల్పోయినా.. వైసీపీ ఇలాంటి దారుణాలకు పాల్పడటం పై అసహనం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Big Stories

×