Heritage Foods Hits 55% Up in Stock Market after AP Elections Results: ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విజయాన్ని అందుకుంది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్ షేర్ దూసుకుపోయింది.
గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఈ కొద్ది రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం వరకు పెరిగాయి.
హెరిటేజ్ ఫుడ్స్లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, లోకేష్కు 10.82 శాతం, బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. దేవాన్ష్కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది.
Also Read: క్లాసిక్ లుక్, డిజైన్తో స్కోడా కుషాక్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. ధర ఎంతంటే..?
జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి 661 రూపాయల దగ్గర ముగిసింది. దీంతో భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్లు, లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యు అమాంతం పెరిగాయి.