Ramoji Rao: ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనకు ఈ మధ్యనే స్టంట్ వేశారు. కొన్నిరోజులుగా ఆరోగ్యంగా ఉన్న ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నారని టాక్. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వయస్సు 87. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు, నెటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.