Chandrababu Says NDA Won with Wonderful Majority: అద్బుతమైన మెజార్టీ సాధించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మూడునెలలు రేయింబవళ్లు మోదీ కష్టపడ్డారని అన్నారు. అందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారన్నారు. భారతీయులు గ్లోబల్ లీడర్లు కాబోతున్నారని వివరించారు.
దూరదృష్టి కలిగిన నేతయిన మోదీ, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారన్నారు చంద్రబాబు. ఏపీలో మూడు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్గా నిలుస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. మోదీ లాంటి పవర్ ఫుల్ నేతల ఎక్కడా చూడలేదన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పెద్దలు ఎన్డీయేలోని పార్టీల నేతలు, ఎంపీలు హాజరయ్యారు.
తామంతా మీ వెంటే ఉన్నామన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు భారత్ ఏ దేశానికీ తలొగ్గదన్నారు. మీ నేతృత్వంలో పని చేసేందుకు గర్వంగా భావిస్తున్నాని తెలిపారు.
Also Read: ఢిల్లీ కీలక సమావేశాలు.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత..అసలు ఏమైందంటే?
అంతకుముందు ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్నాథ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, కుమారస్వామి బలపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్, 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. నరేంద్రమోదీ దూరదృష్టిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలు అందించిందన్నారు. అంతేకాదు ప్రపంచ దేశాల నేతలు సైతం మోదీని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు.
ఎన్డీయే పార్లమెంటరీ సమావేశానికి ముందు ఎంపీ రామ్మోహన్నాయుడు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు 16 మంది పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏపీకి నిధులు తీసుకొచ్చే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే మోదీ మంత్రివర్గంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.
#WATCH | At the NDA Parliamentary Party meeting, TDP chief Chandrababu Naidu says "We are congratulating all of us as we have won a wonderful majority. I have seen during the election campaign, for 3 months PM Modi never took any rest. Day and night he has campaigned. He started… pic.twitter.com/opUZJj7mWS
— ANI (@ANI) June 7, 2024
#WATCH | At the NDA Parliamentary Party meeting, Jana Sena Party chief Pawan Kalyan says "…Modi ji you truly inspire the nation. As long as you are the Prime Minsiter of this country, our country will never bow down to anyone…" pic.twitter.com/ZppyY58oqH
— ANI (@ANI) June 7, 2024