Secunderabad Road accident(Hyderabad news today): సికింద్రాబాద్లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న కారుని కుడి వైపు నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్ జంట నగరాల్లో రోడ్డు నిత్యం బిజీగా ఉంటాయి. ఇక సికింద్రాబాద్ అయితే చెప్పనక్కర్లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమీపంలో ఉంది జూబ్లీ బస్టాండ్. అయితే సిగ్నల్ వద్ద వేగంగా ఓ కారు వెళ్తోంది. ఈలోగా కుడివైపు నుంచి మరో కారు దూసుకొచ్చింది.
డ్రైవర్ అలర్టయ్యేలోపు రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న కారు మూడు పల్టీలు కొట్టింది. అదే సమయంలో అటు వెపు వెళ్తున్న వాహనదారులు, స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు కారులో ఉన్నవారిని బయటకు తీశారు.
ALSO READ: జస్ట్ ఆర్నెలల్లో హీరో నుంచి జీరోకి.. ఏంటిది కేసీఆర్ సారూ..
కారులోని వాళ్లు గాయాలతో బయటపడ్డారు. మరో కారుకి ముందు పార్ట్ డ్యామేజ్ అయ్యింది. దీనికి సంబంధించి సీసీపుటేజ్ని ఇప్పుడు చూద్దాం. వేగంగా వెళ్లవద్దని సిటీలో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినా వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నాయి. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త.
కంటోన్మెంట్ జూబ్లి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం….
సిగ్నల్ వద్ద వెగంగా వెళుతుండగా కారు అడ్డు రావడంతో డీ కోట్టిన మరో కారు..
కారు వెగనికి మూడు పల్టీలు కోట్టిన కారు.. కారు లో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసిన ట్రాఫిక్ పోలీసులు…#roadaccident #caraccident #Secunderabad #contonment… pic.twitter.com/ME9LamQa3M— ChotaNews (@ChotaNewsTelugu) June 6, 2024