JC PrabhakarReddy will resign: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో నెల రోజుల్లో ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన ఎందుకు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు? ఇందుకు కారణమేంటి ఇలా అనేక ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నాయి.
తాడిపత్రి అంటే జేసీ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఏళ్ల తరబడి వారిదే అక్కడ హవా. 2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్రెడ్డి ఓడిపోయారు. వెంటనే జరిగిన తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అప్పట్లో జనసేన మద్దతుతో ఆయన ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఏపీలో టీడీపీ గెలుచుకున్న ఏకైన మున్సిపాలిటీ అదొక్కటే.
ఆ సమయంలో టీడీపీ కౌన్సెలర్లకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు అప్పగిస్తానని హామీ ఇచ్చారు జేసీ ప్రభాకర్రెడ్డి. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం జేసీ ప్రభాకర్రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ALSO READ: పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జేసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్రెడ్డి కొడుకు అస్మిత్రెడ్డి విజయం సాధించారు. మొత్తానికి రాజకీయ పగ్గాలు కొడుక్కి అప్పగించిన తర్వాత పెద్దాయన తప్పుకుంటున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
బిగ్ బ్రేకింగ్
అనంతపురం…
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి 30 రోజులకు రాజీనామా చేస్తానని ప్రకటన.. రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన కూటమి అధికారంలోకి రావడంతో తన నిర్ణయం ప్రకటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. టిడిపి కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానన్న హామీ… pic.twitter.com/8vQ5HjEnlE— ChotaNews (@ChotaNewsTelugu) June 6, 2024