EPAPER
Kirrak Couples Episode 1

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..

ippatam: ఛాన్స్ చిక్కితే చాలు పవన్ కల్యాణ్, చంద్రబాబులపై మాటలతో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. పవన్ వర్సెస్ వైసీపీ వివాదం.. చెప్పులు చూపించుకోవడం వరకూ దారి తీసింది. ఆ రచ్చ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా, జనసేనానిపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు కొడాలి నాని. ఇప్పటం కేసు విషయంలో సెటైరికల్ ట్వీట్ చేశారు.


“నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్”.. అంటూ ట్వీట్ చేశారు నాని. ట్వీట్ లో.. “ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు” అని కూడా ప్రస్తావించారు.

ఇప్పటంలో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేశారంటూ 14 మంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నోటీసులు ఇచ్చాకే ఇళ్లు కూల్చివేశామంటూ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కోర్టు సమయం వృధా చేశారంటూ పిటిషనర్లకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఇదే విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు కొడాలి నాని.


ఇటీవల ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లి మరీ కూల్చివేతలను పరిశీలించారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఒక్కో ఇంటికి లక్ష ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఈ నెల 27న పవన్ మరోసారి ఇప్పటం వెళ్లి బాధితులకు లక్ష రూపాయల చెక్కు ఇవ్వనున్నారు.

Related News

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Big Stories

×