T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ – ఐర్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. న్యూయార్క్ వేదికగా ఈ రెండు టీమ్ లు తలపడుతున్నాయి. మొదటగా టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నది. స్టిర్లింగ్, బాల్ బిర్నీ క్రీజులో ఉన్నారు. ఆర్ష్ దీప్ సింగ్ తొలి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో మొదటి రెండు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్ న్యూయార్క్ లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని ఐర్లాండ్ ను బ్యాటింగ్ కు పిలిచాడు. పిచ్, వాతావరణ పరిస్థితులు సహకరించే అవకాశముండడంతో భారత బౌలర్లు రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు.
టీమిండియాలో హార్ధిక్, శివమ్, అక్షర్, జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
Also Read: ఇక్కడ 140 పరుగులు చేసినా గొప్పే: రోహిత్
ఐర్లాండ్ టీమ్లో.. పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్ కార్తీ, బెంజమిన్ వైట్, జాషవా లిటిల్ ఉన్నారు.