Rohit Sharma:టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో తొలి సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా భారత జట్టు.. ఐర్లాండ్తో ఢీకొట్టనుంది. న్యూయార్క్ వేదికగా నాసా కంట్రీ అంతర్జాతీయ మైదానంలో భారత కాలమాన ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా మాట్లాడాడు.
వార్మప్ మ్యాచ్లో ఏమైందంటే?
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ అభిమాని నేరుగా మైదానంలోకి చొరబడ్డాడు. ఈ సమయంలో ఆ అభిమాని రోహిత్ దగ్గరకు వెళ్లే సరికే.. భద్రతా సిబ్బంది వచ్చి అతడిని పట్టుకున్నారు. నిబంధనులు ఉల్లంఘించి మైదానంలోకి వచ్చిన ఆ అభిమాని ఎక్కడ తప్పించుకుంటారనే కోణంలో భద్రతా సిబ్బంది మీదపై పడి ఉక్కిరిబిక్కిరి చేయసాగారు. అక్కడే ఉన్న రోహిత్.. ఇబ్బంది పెట్టకండి.. కొంచెం సున్నితంగా వ్యవహరించి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మీడియా సమావేశంలో ప్రస్తావన తీసుకొచ్చాడు.
Also Read: ఇక్కడ 140 పరుగులు చేసినా గొప్పే: రోహిత్
అందరి భద్రత ముఖ్యం..
మీరు మైదానంలో ఉండగా ఓ అభిమాని దూసుకురావడం, వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడం, వదిలేయాలని మీరు సూచించడం..ఆ సమయంలో మీరు ఎమోషనల్కు గురయ్యారా? అని సదరు జర్నలిస్ట్ రోహిత్ను ప్రశ్నించాడు. దీనికి రోహిత్.. మీరు అడిగిన ప్రశ్నతోపాటు ఆ సంఘటన రెండూ తప్పే అన్నారు. మైదానంలో ఆటగాళ్లకు భద్రత చాలా ముఖ్యం. ఈ సమయంలో అభిమానులు లోపలికి రావడం తప్పు. అయితే ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల భద్రతా కూడా ముఖ్యమైంది. కానీ మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లకు చాలా నియమ, నిబంధనులు ఉంటాయి. వీటిని అభిమానులు అర్థం చేసుకోవాలి. అంతేకానీ, ఇష్టానుసారంగా మైదానంలోకి రాకూడదన్నారు. ఈ విషయంలో ఆటగాళ్లు లక్ష్యం వైపు ఆలోచిస్తుంటారని చెప్పాడు.