Raghuramakrishnaraju :
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీను కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిట్ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.