Railyway Strict Layoffs : రైల్వే శాఖలో నిబంధనలు పాటించని, అవినీతికి పాల్పడే ఉద్యోగులను వెనువంటనే ఇంటికి పంపించే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. గతేడాది రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిబంధనలు చాలా స్ట్రిక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. 2021 జులై నుంచి ఈ రోజు వరకు సుమారు 170కు పైగా రైల్వే ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు.
అవినీతికి పాల్పడే ఉద్యోగులను రైల్వే శాఖ ఏమాత్రం భరించడం లేదని.. తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు ఓ సీనియర్ అధికారి. డ్యూటీలో విధులు సరిగా నిర్వర్తించని ఉద్యోగులకు ఇప్పటికే వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. అలా వీఆర్ఎస్ తీసుకున్నవారు జులై 2021 నుంచి ఇప్పటివరకు 139 మంది ఉన్నారు.
రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించగానే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన హెచ్చరించినట్లుగానే అవినీతికి పాల్పడుతున్న, విధుల సరిగా నిర్వర్తించని వారిపై వేటు పడుతోంది. ఉద్యోగుల తెలగింపులు కూడా ముఖ్యంగా ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెడికల్, స్పోర్ట్స్, మెకానికల్, విభాగాల్లో ఉన్నట్లు సమాచారం.