Malla Reddy IT Raids Updates : విహారయాత్ర కోసం టర్కీ వెళ్లిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఐటీ దాడులపై ఆయన మాట్లాడారు. వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు సహజమేనన్నారు. దాడులపై పూర్తి సమాచారం లేదని…అన్నీ తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని….ఐటీ సోదాల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. 40 ఏళ్లుగా వ్యాపారంలో ఉన్నామని….ఇదంతా సహజమేనని చెప్పారు