Chandrababu Naidu Press Meet on Andhra Pradesh Election Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంపై చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇవి హిస్టారికల్ ఎన్నికలని, ఇలాంటి ఎన్నికలను తన రాజకీయ జీవితంలో చూడలేదని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఎన్నికలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
- ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో, ఇబ్బంది పెట్టారో అన్నీ చూశాం.
- ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి, ఎన్ని త్యాగాలైనా చేసి భావితరాల భవిష్యత్తుకోసం ముందుకెళ్లాం.
- చాలా ఎన్నికలు చూశాం. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. రాజకీయ పార్టీలు, అధికారం అశాశ్వతం.
- వ్యక్తులు కనుమరుగైతే రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయి.
- ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు.
- ఓడితే కుంగిపోలేదు.. గెలిస్తే గంతులేయలేదు.
- ఈ ఎన్నికల్లో అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా లక్షలు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి వచ్చారు.
- కూలిపనులు, పాచిపనులు చేసుకునేవారు కూడా రైళ్లు, బస్సులు ఎక్కి వచ్చి మరీ ఓటేశారు.
- ఈ కమిట్ మెంట్ ను ఎలా వర్ణించాలో, ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు.
- ఈ ఎన్నికలు సువర్ణాక్షరాలతో లిఖించదగిన హిస్టారికల్ ఎన్నికలు.
- 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక పోటీ చేసి 200 సీట్లు గెలిచాం.
- 1994లో ప్రజా వ్యతిరేకత వల్ల అపోజిషన్ లీడర్ గా ఉండే స్టేటస్ కూడా లేకుండా రిజల్ట్ వచ్చింది.
- ఈ ఎన్నికల్లో తీర్పు వాటన్నింటికంటే భిన్నం.
- ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
- అప్పుడూ, ఇప్పుడూ చెప్పేది ఒక్కటే.. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి.
- ఈ ఎన్నికల్లో 55.38 శాతం ఓట్లు రాగా.. టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
- చార్మినార్ ఎంఐఎం కంచుకోట. ఆ తర్వాత కుప్పం, సిద్ధిపేట రెండోస్థానానికి పోటీ పడేవి. ఈసారి 94 వేలు, 92 వేలు, మంగళగిరిలో 91 వేలు మెజార్టీ వచ్చాయి.
- ఇవన్నీ చూశాక.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదిపడితే అది చేస్తే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందనిపించింది.
- గుణపాఠం పాలకులకు కాదు.. అవినీతి, అహంకారంతో ఉండే ఎలాంటి వారికైనా ఇదే జరుగుతుందని ప్రజలు నిరూపించారు.
- ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కంటి నిండా నిద్ర లేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.
- మనిషిని హింసించి.. ప్రాణం ఉండాలంటే జై జగన్ అనాలని ఇబ్బంది పెడితే.. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు విడిచారు.
- ఆ కమిట్మెంట్ తోనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం.
- ఒక్క కార్యకర్తలే కాదు.. మీడియా కూడా ఇబ్బంది పడింది. అవన్నీ తలచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తల వంచుకోవాలి.
- ఇది అధికారం కాదు. ఒక బాధ్యత.. మేము పాలకులం కాదు.. సేవకులం కాదన్న నినాదానికి కట్టుబడి పనిచేస్తాం.
- మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తాం.
- ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పవన్ కల్యాణ్ కూటమికి బీజం వేశారు. ఇందులో బీజేపీ కూడా భాగస్వామ్యమవ్వడంతో ముగ్గురం కలసి పనిచేశాం.
- 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ స్థానాల్లో భాగస్వామ్యంగా పనిచేసి అనూహ్యమైన విజయాన్ని సాధించాం. ఇక్కడి నుంచి బాధ్యతగా ఎలా పనిచేయాలో ప్లాన్ చేసుకుంటాం.
- వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఎకానమీ కుప్పకూలిపోయింది. ఎన్ని అప్పులు చేశారో ఇంకా తేలలేదు. తమకు అడ్డే లేదని విర్రవీగారు.
- అసెంబ్లీ సాక్షిగా నా భార్య, కుటుంబానికి జరిగిన అవమానానికి చాలా బాధపడ్డాను. నాపై బాంబు దాడి జరిగినపుడు కూడా అంత బాధపడలేదు.
- మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వస్తానని ఆ నాడు చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. ప్రజల రుణం తీర్చుకుంటా.
- ఐదేళ్ల పాలనలో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎన్ని అప్పులున్నాయో నాలుగైదు రోజుల్లో చూసి అన్నీ వెల్లడిస్తాం – చంద్రబాబు
Share