Kavitha: ఎమ్మెల్సీ కవిత బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈడీ, ఐటీ దాడులపై కమలనాథులను నిలదీశారు. బీఎల్ సంతోష్, బండి సంజయ్ ల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ కవిత ఏమన్నారంటే…
తప్పు చేయకపోతే బీఎల్ సంతోష్ కు అంత భయమెందుకు అని ప్రశ్నించారు. విచారణకు రమ్మంటే రాకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. మన దగ్గర దొరికితే విచారణ చేయొద్దా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడో అర్థంకావట్లేదన్నారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు కవిత.
నెల రోజులుగా మన మంత్రులు ఈడీ, ఐటీ విచారణకు హాజరవుతున్నారని.. అదే, సిట్ పిలిస్తే బీఎల్ సంతోష్ రావట్లేదన్నారు. ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని.. తెలంగాణలో భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు కవిత.
బీజేపీకి ఒక లీడర్ లేడు.. ఐడియాలజీ లేదంటూ మండిపడ్డారు. అందుకే, ఇతర పార్టీల లీడర్లను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు.