SIT notices : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో సిట్ దూకుడుగా ముందుకెళుతోంది. దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్కు తాజాగా సిట్ నోటీసులు పంపింది. ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది.
ఇప్పటివరకు సిట్ నోటీసులకే పరిమితమైంది. ఇకపై నిందితులను అరెస్ట్ చేసేందుకు సిట్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై న్యాయనిపుణులతో సిట్ అధికారులు చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ కు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, బీడీజేఎస్ చీఫ్ తుషార్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అయినా సరే వారు ముగ్గురు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.