EPAPER

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు

Taj Express: రైలులో అగ్ని ప్రమాదం.. నాలుగు బోగీల్లో ఎగిసిపడుతున్న మంటలు

Taj Express Train Fire: ఢిల్లీ తాజ్ ఎక్స్ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్లాబాద్ నుంచి ఓక్లా వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు బోగీల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఢిల్లీలోని సరిత విహారం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 4.24 గంటలకు తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని, 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు.


Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×