Aadhaar Update Online: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువును పొడిగించింది. ఈ కొత్త గడువు ప్రకారం వినియోగదారులు ఇప్పుడు జూన్ 14, 2024 వరకు తమ ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూన్ నెల ప్రారంభమై రోజులు కూడా దగ్గరపడుతున్నాయి. భారతీయలు తమ ఐడెంటి ప్రూఫ్ (POI) ,ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి ఇప్పుడు దాదాపు 10 రోజులు మిగిలి ఉన్నాయి.
ఇప్పుడు ఆధార్ ఉన్నవారు జూన్ 14 వరకు ఆన్లైన్లో తమ ఆధార్ కార్డ్లోని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA)లను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI, POA డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. 5-15 సంవత్సరాల వయస్సులో తన బ్లూ ఆధార్ కార్డ్లో పిల్లల బయోమెట్రిక్ వివరాలను కూడా అప్డేట్ చేయాలి.
Also Read: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!
ఆధార్లో మీరు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ/వయస్సు, జెండర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రెస్, రిలేషిప్ స్టేటస్ని ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు. ఆధార్ అనేది భారతీయ నివాసులందరికీ జారీ చేయబడిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్. ఇది ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలను సేఫ్గా చేయడానికి అవసరం. ఆధార్ను అప్డేట్గా ఉంచుకోవడం మోసపూరిత కార్యకలాపాలకు దూరంగా ఉండొచ్చు.
ఆన్లైన్లో ఆధార్ను ఎలా అప్డేట్ చేయాలి?
ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం అవసరమైన పత్రాలు
Also Read: మారుతీ నుంచి డ్రీమ్ సిరీస్ కార్లు.. బుకింగ్స్ స్టార్ట్!
మీరు జూన్ 14, 2024 వరకు ఆన్లైన్లో ఆధార్ కార్డ్లో మీ ఐడెంటిటీ, అడ్రస్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువు తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ను అప్డేట్ చేస్తే మీరు దాని కోసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.