Droupadi Murmu wishes to Telangana People: తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు మరింతగా అభివృద్ధి చెందాలని ముర్ము ఆకాంక్షించారు.
Also Read: ట్యాంక్ బండ్పై అంబరాన్నంటిన సంబరాలు
గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకలు: ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమంటూ ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్) గా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు.