EPAPER

26/11 Terrorist Attack : 26/11 ఉగ్రదాడికి 14 ఏళ్లు.. రాజీ పడేదే లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్..

26/11 Terrorist Attack : 26/11 ఉగ్రదాడికి 14 ఏళ్లు.. రాజీ పడేదే లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్..

26/11 Terrorist Attack : ముంబయి తాజ్ హోటల్ 26/11 ఉగ్రదాడికి నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు అక్రమంగా భారత్‌లో చొరబడి మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది సామాన్యులు, పోలీసులు, ఎన్ఎస్‌జీ కమాండోస్ ప్రాణాలు కోల్పోయారు.


నాలుగు రోజులు జరిగిన ఈ మారణకాండలో 140 మందికి పైగా భారతీయులు, 26 మంది విదేశీయులు మృతిచెందారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. 1 నిమిషం, 36 సెకండ్ల ఈ వీడియోలో ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు గురించి వివరించారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కు తగ్గదని, రాజీ పడదని అన్నారు.

ఒక్క ప్రాణం పోయినా సహించమని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేవరకు విశ్రమించమని తేల్చి చెప్పారు జయశంకర్. అయితే 26/11 దాడుల సూత్రధారుల వివరాలను భారత్ ఐక్యరాజ్యసమితికి అందించింది. వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చమని అభ్యర్ధించింది. పాకిస్థాన్, చైనా కలిసి ఈ ప్రతిపాదనను హోల్డ్‌లో పెట్టాయి. భారత్ అందించిన సూత్రధారులు పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ సయీద్, లష్కర్ ఎ తొయిబా నేత సాజిద్ మీర్, సీనియర్ జెయిషే మహ్మద్ నాయకుడు అబ్దుల్ రఫూఫ్, అబ్దుల్ రెహ్మాన్ మక్కి.


Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×