KTR tweet on Telangana formation day: దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్దం గడిచిన సందర్భమిదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటంగా వర్ణించారు.
ముఖ్యంగా అమరుల ప్రాణ త్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా ఈ దశాబ్ద ప్రయాణం గడిచిందన్నారు.
ముఖ్యంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. నాడు కరవు, రాళ్లు రప్పల, కల్లోలిత తెలంగాణ.. ఇవాళ సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ అంటూ ప్రస్తావించారు.
ALSO READ: హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం
అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇక ముందు కొనసాగాలని కోరారు. ప్రతి ఒక్కరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ రాసుకొచ్చారు.