Hyderabad is now capital of telangana: ఆంధ్రప్రదేశ్తో హైదరాబాద్కు బంధం తెగింది. హైదరాబాద్ ఇక తెలంగాణ సొంతమైంది. ఇప్పటి వరకు గవర్నర్ చేతిలో ఉన్న రాజధాని పౌరుల ఆస్తి, రక్షణ వ్యవహారాలు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చాయి.
ఏపీ పునర్విభన చట్ట ప్రకారం హైదరాబాద్ను తెలంగాణకు శాశ్వత, ఏపీకి పదేళ్లు తాత్కాలిక రాజధానిగా కేంద్ర ప్రకటించింది. ఆ గడువు జూన్ ఒకటి (శనివారం)తో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్.. తెలంగాణ సొంతమైంది.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామన్నా రు. ప్రజా పాలన అందిస్తామని వెల్లడించారు.
విభజన చట్టం ప్రకారం పదేళ్లుపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకు దక్కతాయని పేర్కొన్నారు.
ఏళ్ల సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీ నాయకులందరి కీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి.
ALSO READ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, అమరులకు నివాళులతో.. పల్లెల్లో సంబరాలు
ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెడుతోంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది.