Ap Elections 2024 Exit Polls: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ నేడు ముగియడంతో శనివారం సాయంత్రం పలు సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
ఆంధ్ర ప్రదేశ్లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు ఏపీలో అధికారం కూటమిదేని స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏపీలో అధికారం కూటమిదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 106-119 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ తేల్చి చెప్పింది. ఇక అధికార వైసీపీకి 56-69 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది బిగ్ టీవీ.
ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 17-18 ఎన్డీయే కూటమి గెలుస్తుందని.. వైసీపీ కేవలం 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకోనుందని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.
ఏపీ లోక్ సభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్