Harihara Veeramallu: ప్రస్తుతం ఏపీ మొత్తం హీటెక్కిపోయి ఉంది. మరో మూడు రోజుల్లో ఏపీ ప్రజల భవిష్యత్ ఎవరి చేతులో ఉండబోతుందో తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రాజకీయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరూ.. ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
పార్టీ ఫండ్ కోసమని సినిమాలు చేస్తున్న పవన్.. ఎలక్షన్స్ కోసం నిర్మాతలు వద్ద డబ్బులు తీసుకొని ప్రచారం ముగించాడు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఫినిష్ చేయాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇక ఈ మూడింటిలో హరిహర వీరమల్లు ఎప్పటినుంచో పవన్ కోసం ఎదురుచూస్తుంది.
కొన్నేళ్లుగా ఈ సినిమా షూట్ జరుగుతూనే ఉంది. కానీ, పవన్ రాజకీయాలలో బిజీగా ఉంటూ దాన్ని పక్కన పెడుతూ వస్తున్నాడు. ఇక నిర్మాత ఎఎం రత్నం మాత్రం పవన్ ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్ అని చెప్పి ఎదురుచూస్తున్నాడు. ఇక ఎట్టకేలకు ఆ ఎదురుచూపులు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. అసలు గత కొన్నిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకూండా ఉన్నారు.
డైరెక్టర్ క్రిష్.. సినిమా నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో జ్యోతికృష్ణ వచ్చాడు. ఒక్క సినిమా తీసిన అనుభవంతో ఇంత పెద్ద సినిమా ఎలా తీయ్యగలడు అనే అనుమానం ప్రేక్షకులలో మొదలయ్యింది. సరే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యింది.. చివరన కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.. అవి మాత్రమే అతను డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇక ఎప్పుడు పవన్.. ఈ సెట్ లో అడుగుపెడతాడు అన్నదానికి ఎట్టకేలకు ఒక సమాధానం వచ్చింది.
జూన్ 4 న ఎన్నికల ఫలితాల తరువాత హరి హర వీరమల్లులో పవన్ అడుగుపెట్టనున్నట్లు ఏఎం రత్నం అధికారికంగా తెలిపాడు. ఈ సినిమాను ఫినిష్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో కూడా పవన్ ఈ సినిమాలు చేస్తాడా.. ? చేయడా.. ? అనేది కూడా రిజల్ట్స్ నిర్ణయిస్తాయి అని తెలుస్తోంది. మరి ఫలితాల తరువాత హీరో పవన్ అవుతాడా.. ? సీఎం పవన్ అవుతాడా.. ? అనేది చూడాలి.