TS Highcourt : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. సిట్ ఇచ్చిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తుదిపరి విచారణ డిసెంబర్ 5 కు వాయిదా వేసింది.
ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ఆయన తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో బీఎల్ సంతోష్ ను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. 41ఏ నోటీసుల విషయంలో సింగిల్ జడ్జి ఆదేశాలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ పాత్రపై ఆధారాలున్నాయన్నారు. ఆయన విచారణకు వస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఇచ్చిన సిట్ నోటీసులపై స్టే విధించింది.