Singaporeopen 2024 Treesa- Gayatri stun WR2: సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సంచలనం నమోదయ్యింది. మహిళల డబుల్స్ విభాగంలో భారత్కి చెందిన గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి, ప్రపంచ రెండో ర్యాంక్ జంటకు షాకిచ్చింది. దీంతో గాయత్రి జోడి క్వార్టర్ ఫైనల్కి దూసుకెళ్లింది. భారత డబుల్స్ జోడి గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి 30వ ర్యాంక్లో ఉన్నారు.
గురువారం మధ్యాహ్నం గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడి, కొరియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్ ప్లేయర్ బేక్ హా నా- లీసో హీ మధ్య పోరు సాగింది. ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నరీతిలో తలపడ్డారు. దాదాపు గంటపాటు మ్యాచ్ సాగడం విశేషం. తొలిసెట్ను కేవలం ప్రత్యర్థికి 9 పాయింట్లు మాత్రమే ఇచ్చింది గాయత్రి జోడి. సెకండ్ సెట్లో భారత్ జోడి ప్రతిఘటించినప్పటికీ పరాభవం తప్పలేదు.
దీంతో మూడో సెట్ ఇరువురు ఆటగాళ్లకు కీలకంగా మారింది. ఫస్టాప్లో ఆధిపత్యం ప్రదర్శించిన గాయత్రి జోడి, చివరకు వరకు అదే స్పీడ్ కొనసాగించింది. చివరకు 21-9, 14-21, 21-15 తేడాతో విజయం సాధించి క్వార్టర్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు సంచలనం నమోదు కావడం ఇదే తొలిసారి. క్వార్టర్స్లో కొరియాకు చెందిన మరో జంట కిమ్ యుయాంగ్-కాంగ్ యాంగ్తో గాయత్రి జోడి తలపడబోతోంది. ఇక్కడ గెలిస్తే పతకం ఖాయం.
మహిళల సింగల్స్ విభాగంలో పీవీ సింధుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు- స్పెయిన్కు చెందిన కరోలినా మారీన్ చేతిలో ఓటమి పాలైంది. వీరిద్ధరి మధ్య ఆరు మ్యాచ్ జరగ్గా అన్నింటిలోనూ సింధు ఓడిపోయింది. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు.
ALSO READ: కొత్త జెర్సీతో మెరిసిన.. టీమ్ ఇండియా
ఇక పురుషుల సింగల్స్లో భారత స్టార్ ఆటగాడు ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. ప్రి క్వార్టర్స్లో జపాన్కు చెందిన కెంటా నిషిమొటో చేతిలో ఓడిపోయాడు. 13-21, 21-14, 15-21 తేడాతో టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఇటు సింధు, అటు ప్రణయ్ ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేదు.