Telangana State Song Good, Says Leaders: తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతం బాగుందంటూ పేర్కొన్నారు. సచివాలయంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తోపాటు పలువురు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆయన బృందం గీతాన్ని ఆలపించారు. ఆ గీతంలో చేసిన పలు మార్పులను కవి అందెశ్రీ అందరికీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13.30 నిమిషాలు ఉంటుందని ఆయన తెలిపారు. చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా ఆయన వినిపించారు. అయితే, ఈ రెండూ కూడా బాగున్నాయంటూ నేతలు చెప్పారు. కొమురం భీం, ముఖ్ధూం మొహినుద్దీన్, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లను కూడా ఆ గీతంలో చేర్చాలని వారు సూచించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ దిశగా పరిశీలించారంటూ అందెశ్రీకి సీఎం సూచించారు.
Also Read: అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
అదేవిధంగా రాష్ట్ర అధికార చిహ్నం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. చిహ్నంపై ఎటువంటి భేషజాలు, పంతాలు లేవని సీఎం పేర్కొన్నారు. చిహ్నం విషయంలో అందరి సూచనలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కేబినెట్, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జయజయహే తెలంగాణ సాంగ్ ఇదే.. ఫైనలైజ్ చేసిన కమిటీ#telangana #song #jajayaheTelangana #chotanews #celebrations pic.twitter.com/BqzyiMS8gt
— ChotaNews (@ChotaNewsTelugu) May 30, 2024