Chandragiri Dsp action by DGP: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే కాదు, తర్వాత కూడా పోలీసుల పై వేటు కంటిన్యూ అవుతోంది. ఎన్నికల్లో ఖాకీల వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇంటాబయటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
తాజాగా చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్కుమార్పై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి ఆయనను సరెండర్ చేస్తూ ఉత్వర్వులు జారీ అయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగిన ఘటనలను నిలువరించడంతో విఫలమైనందుకు వేటు వేసినట్టు తెలుస్తోంది. అధికార-విపక్షాల కార్యకర్తలు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నా వాటికి కంట్రోల్ చేయకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
ఎన్నికలకు మూడు నెలల కిందట యశ్వంత్ను చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. అయినా యశ్వంత్ పట్టించుకోలేదు. ఎన్నికల రోజు ఘర్షణలను నివారించడంలో పోలీసు అధికారి విఫలమయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తర్వాతైనా టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి భద్రత కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఇంకెంతమంది అధికారులపై వేటు పడుతుందో చూడాలి.
ALSO READ: వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు: అశోక్ బాబు
ఇదిలావుండగా ఎన్నికల ఫలితాల వేళ పల్నాడు హింస జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోదాలు తీవ్రతరం చేశారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గడ్డివాములో దాచి ఉంచిన నాలుగు పెట్రోల్ బంబులను స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. దీంతో పోలీసులు అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలపై ఓ నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని ఆ జిల్లా ఎస్పీ, దిగువస్థాయి అధికారులకు సీరియస్గా చెప్పినట్టు సమాచారం.
తిరుపతి.. చంద్రగిరి డిఎస్పీ పై వేటు.. DSP యశ్వంత్ రాజ్ కుమార్ డీజీపి కార్యాలయంలో సరెండర్ కావాలంటూ ఆదేశాలు.. మూడు నెలల క్రితమే చంద్రగిరి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్ రాజ్ కుమార్.. నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం అయినందుకే బదిలీ అయినట్టు సమాచారం.. #tirupati… pic.twitter.com/lAzZq4kwMb
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2024
పల్నాడు జిల్లా…..
బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం.
గడ్డివాములో దాచి ఉంచిన నాలుగు పెట్రోల్ బంబులను స్వాధీనం చేసుకున్న స్థానిక ఎస్సై రాజేష్..#petolbombs #apelectionwar #guntur #palnadu #bigtvlive pic.twitter.com/xPVCkxlTkO
— BIG TV Breaking News (@bigtvtelugu) May 29, 2024