Bounce Infinity E1X Electric Scooter Launched with Rs 55000: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. అటువంటి పరిస్థితిలో ఓలా, ఏథర్ వంటి పెద్ద తయారీదారులు తమ స్కూటర్లను నిరంతరం విడుదల చేస్తున్నారు. అయితే అదే సమయంలో స్టార్టప్ కంపెనీలు కూడా ఈ వరుసలో వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికే ఎన్నో స్టార్టప్ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు మరొక కొత్త కంపెనీ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
బెంగళూరుకు చెందిన EV తయారీదారు ‘Bounce Infinity’ కొత్త E1X ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ మార్పిడి చేయగల వేరియంట్ను తాజాగా లాంచ్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ ప్రకారం.. ఈ E1X electric scooter జూన్ 2024 నుండి దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. Bounce Infinity E1X బ్యాటరీ మార్పిడి చేయగల వేరియంట్ను రూ. 55,000 నుండి రూ. 59,000 (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది. కంపెనీ ప్రకారం.. కొత్త ఇన్ఫినిటీ E1X ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని అన్ని ప్రధాన బ్యాటరీ మార్పిడి నెట్వర్క్లకు కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది.
బ్యాటరీ స్వాపింగ్ ఫీచర్ అంటే మీరు ఏ నెట్వర్క్ స్టేషన్లోనైనా పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో బౌన్స్ ఇన్ఫినిటీ E1X ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్చార్జ్డ్ బ్యాటరీని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇది మీ ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలిగించదు. కంపెనీ E1X EVని రెండు విభిన్న స్పీడ్ వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కి.మీ, మరొకటి గంటకు 65 కి.మీల వేగంతో నడుస్తుంది.
Also Read: గత నెలలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో 30,000 కంటే ఎక్కువ EVల విక్రయం కోసం బౌన్స్ ఇన్ఫినిటీ ఇటీవల సన్ మొబిలిటీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. బెంగళూరు, హైదరాబాద్తో పాటు ముంబై, పూణె, ఢిల్లీలలో కూడా కంపెనీ తన సేవలను ప్రారంభించనుంది. బౌన్స్ ఇన్ఫినిటీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కేవలం కిలోమీటరుకు రూ. 1 నుండి 1.50 ధరతో నడపవచ్చు. తక్కువ నిర్వహణ ఖర్చులతో అన్ని రకాల వినియోగదారులకు సౌకర్యాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
వినియోగదారులు తమ డెడ్ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసిన వాటి కోసం ఏదైనా నెట్వర్క్ స్టేషన్లో మార్పిడి చేసుకోవచ్చు. దీంతో ఛార్జింగ్కు ఎంత సమయం పడుతుందోనని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇంతకుముందు, కంపెనీ తన E1+ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం తగ్గింపును ప్రకటించింది. ఆ తర్వాత మీరు E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 1.13 లక్షలకు బదులుగా రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)కే కొనుగోలు చేసే అవకాశాన్ని అందించింది. E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ తొలగించగల బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ని 15 amp వాల్ సాకెట్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 2.2 కిలోవాట్ల విద్యుత్ మోటారును అమర్చారు. ఈ మోడల్ గరిష్ట వేగం గంటకు 65 కి.మీ.