Man Beheads wife over Heated Argument then Chops Body to Pieces: ఆలుమగల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం సర్వసాధారణం. గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి. గొడవలు వచ్చినప్పుడు రెండుమూడు రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తరువాత మళ్లీ ఇద్దరు ఒక్కటవుతుంటారు. కానీ, ఓ భార్యాభర్తల మధ్య చిన్న వివాదం జరిగింది. అది హత్యకు దారి తీసింది. అత్యంత కిరాతంగా భార్యను హత్య చేశాడు ఆ భర్త. హత్య చేసిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: మిజోరంలో కూలిన రాళ్ల క్వారీ, 10 మంది మృతి..
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శివరామ్- పుష్ప భార్యాభర్తలు. వీరికి 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. వీరు ఓ అద్దె భవనంలో నివసిస్తున్నారు. అయితే, వీరి మధ్య గత సోమవారం చిన్న వివాదం చెలరేగింది. ఈక్రమంలో ఆగ్రహంతో భర్త తన భార్యను హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను ముక్కలు ముక్కలుగా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు 32 ఏళ్లు ఉన్న పుష్పగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణంగా గుర్తించారు.