Bomb Threat Call to Telangana Praja Bhavan: హైదరాబాద్లో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ప్రజాభవన్లో బాంబు పెట్టామని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. మరి కాసేపట్లో ప్రజాభవన్ను పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే అందరినీ అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించి తనిఖీ చేస్తున్నారు.
బాంబు బెదిరింపుతో అధికారులు ప్రజాభవన్తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజా భవన్..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం. మరో వైపు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆగంతకుడిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. దీనిపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రస్తుతం భవన్ లోపల తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ ఎవరు చేశారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారని తెలిపారు.