Konatala Says Kutami Will Form the Government in AP after meeting with Ashokgajapathiraju: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడంతో నేతలు రిలాక్స్ అవుతున్నా రు. కొందరు లాంగ్ టూర్లకు వెళ్తుండగా, మరికొందరు దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఈ జాబితాలోకి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఒకరు.
తాజాగా విజయనగరం వచ్చిన కొణతాల పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకుపైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ఫలితాల పరిస్థితి వంటి అంశాలపై డీప్గా చర్చించుకున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు కొణతాల రామకృష్ణ.
ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు కొణతాల. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ రకమైన పరిపాలన ఉండాలని కోరుకున్నారో అదే జరుగుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపడతారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటన్నారు. విద్య, ఆదాయ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతమని, ఇక్కడ అభివృద్ది చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు.
Also Read: Chandrababu return from foreign tour: విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు, రేపో మాపో విజయవాడకు..
20 ఏళ్ల కిందటి ఒకసారి వెనక్కి వెళ్తే.. కొణతాల కాంగ్రెస్లో ఉండగా, అశోక్ గజపతిరాజు టీడీపీలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొణతాల జనసేన వైపు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ సీనియర్ నేతలను కలుస్తూ వస్తున్నారట కొణతాల రామకృష్ణ. మరి దీనివెనుక మర్మమేంటని చర్చించుకోవడం ఫ్యాన్ పార్టీ నేతల వంతైంది.
ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం. సీఎం జగన్ హయాంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు: విజయ నగరంలో టీడీపీ నేత అశోక్ తో భేటీ తర్వాత జనసేన నేత కొణతాల రామకృష్ణ. #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag pic.twitter.com/EUKY5ze48V
— Vizag News Man (@VizagNewsman) May 27, 2024