CS Review on Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సంబంధించి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తరువాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.
Also Read: ‘కాంగ్రెస్ ఆస్తులు పోగు చేసింది.. మోదీ మాత్రం వాటిని ధారాదత్తం చేశారు’
జూన్ 1న ట్యాంక్ బండ్ పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాల్స్, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలు కూడా ఏర్పాటు అవుతాయన్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతదని పేర్కొన్నారు. అందులో బాణసంచా, లేజర్ షో ఉంటాయన్నారు. 5 వేల మంది వరకు శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని ఆమె తెలిపారు.