Jharkhand: అర్ధరాత్రి ఒంటి గంటకు మద్యం సరఫరా చేయడానికి నిరాకరించిన బార్ సిబ్బంది ఒకరిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. రాంచీలోని ఓ బార్ లోకి వచ్చిన నలుగురు దుండగుల్లో ఓ వ్యక్తి తుపాకీతో డీజేను కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రాంచీలొని ఓక్స్ ట్రీమ్ స్పోర్ట్స్ బార్లోకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చారు. అప్పటికే బార్ మూసి ఉంది. వచ్చిన నలుగురు మద్యం సప్లై చేయాలని సిబ్బందిని అడిగారు. దానికి సిబ్బంది నిరాకరించడంతో బార్ సిబ్బందికి వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బార్ లో రోజువారీ జీతానికి పని చేస్తున్న సందీప్ అనే డీజేపై ఓ దుండగుడు కాల్పులు జరిపారు.
దుండగుడు ముఖం కనిపించకుండా టీ షర్ట్ ధరించి అతి దగ్గర నుంచి సందీప్ ను కాల్చాడు. దీంతో అక్కడే ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అయితే సందీప్ ను అక్కడ ఉన్న వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Also Read: బ్లాక్ మెయిల్ చేస్తూ బాలుడిపై అత్యాచారం.. బ్లాక్ మెయిలర్ ను హత్య చేసిన బాధితుడు
అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీపుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై రాంచీ ఎస్పీ చందన్ కుమార్ మిశ్రా కూడా మీడియాతో మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలకు సేకరించారు. అయితే కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసిన వారు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. పోలీసులు ఉదాశీన వైఖరికి కాల్పలు కారణం నిదర్శనం అని చెబుతున్నారు. రాంచీలో చాలా సార్లు బార్లు అర్థరాత్రి 2 నంచి 3 గంటల వరకూ తెరిచే ఉంటాయని చెబుతున్నారు.
रांची के एक्सट्रीम बार में डीजे सैंडी को गोली मारने का वीडियो, रात में 1:00 बजे के बाद गोली मारी गई है जबकि बार बंद करने का टाइम 11:00 है ऐसे में पुलिस का ढीला रवैया प्रश्न चिन्ह खड़ा करता है रांची में बहुत से बाहर दो-तीन बजे रात तक चलते हैं#xtremebarranchi #brekingnews #ranchi pic.twitter.com/p61Nu2KrvI
— Prem Shankar (@prem_sanmarg) May 27, 2024