84 – Year Old Man attended 8th Class Exams: ఆయనొక ఆయుర్వేద వైద్యుడు. అతని వయస్సు 84 సంవత్సరాలు. ఆయుర్వేద వైద్యంలో ఆయనకు మంచి పట్టు ఉంది. చాలామంది ప్రముఖులకు కూడా ఆయన ఆయుర్వేద వైద్యం చేశారు. ఇప్పుడాయన 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇంతకుముందుకు ఆయన ఐదో తరగతి పరీక్షలు కూడా రాశారు. తరువాత పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తానని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని ఛింద్ వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు. 84 ఏళ్ల వయస్సున్న అతను ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘చదువుకు వయస్సుతో సంబంధం లేదు. అందుకే నేను మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డ్ నిర్వహిస్తున్న 8వ తరగతి పరీక్షలు రాస్తున్నాను. గతంలో కూడా ఐదో తరగతి పరీక్షలు రాశాను. 8వ తరగతి పరీక్షల తరువాత 10, ఇంటర్ పరీక్షలు కూడా రాస్తాను’ అని ప్రకాశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Also Read: పూణె యాక్సిడెంట్లో కొత్త నిజాలు, ఇద్దరు డాక్టర్లు అరెస్ట్, ఏం జరిగింది?
ఆయుర్వేదంలో మంచి పట్టు సంపాదించిన ప్రకాశ్.. సామాన్యుల నుంచి ప్రముఖులకు కూడా ఆయుర్వేద సేవలు అందిచారు. అమితాబ్ బచ్చన్ వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలకు కూడా ఆయన సేవలు అందిచారు. అంతేకాదు.. ఆయన ఇప్పటివరకు 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద సేవలు అందించినట్లు తెలుస్తోంది.