4 Killed in Tirupati Car Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందన్న డీటేల్స్లోకి వెళ్తే..
తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పింది. కారు బలంగా డివైడర్ని ఢీ కొట్టింది. కారు వేగానికి ముందు పార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ట్రావెల్ సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నారు.
స్పాట్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూసి షాకయ్యారు. మృతులంతా నెల్లూరు జిల్లాకి చెందినవారు. గాయపడినవారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Also Read: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు
డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, అతివేగంగా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. నెల్లూరు నుంచి వేలూరులో ఉన్న సీఎంసీలో ట్రీట్మెంటు కోసం ఆయా వ్యక్తులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Tirupati, Andhra Pradesh: Four people were killed, and two others were seriously injured when the car they were traveling in collided with a culvert. pic.twitter.com/ON4a9fkMen
— IANS (@ians_india) May 27, 2024