Rakesh dies of heart attack: పార్లమెంటు ఎన్నికల వేళ హర్యానా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. అయితే, ఆరో విడతలో భాగంగా శనివారం హర్యానాలో కూడు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. హర్యానాలోని బాద్ షా పూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్(44) మృతిచెందాడు. శనివారం ఉదయం గురుగ్రామ్ లో గుండెపోటుతో ఆయన మరణించాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాద్ షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతరం ఆయన బీజేపీకి మద్దతు పలికారు.
Also Read: 24 మంది సజీవదహనం.. ఇంకా ఎగిసిపడుతున్న మంటలు – వీడియో
రాకేశ్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అయితే, ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రాకేశ్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. 2019 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై 10,157 ఓట్ల తేడాతో గెలిచారు. హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, రాకేశ్ మృతితో బీజేపీ మెజారిటీని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.