56 Pilgrims have died in Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఎంతమంది మృత్యువాత పడ్డారనేదానిపైన అధికారులు వివరాలు వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 50 ఏళ్లు పైబడినవారు 40 మంది ఉన్నారని తెలిపారు. గుండెపోటు, పల్మనరీ ఎడమా వల్ల 47 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా కేదార్ నాథ్ ధామ్ యాత్ర మార్గంలో 27 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.