Ipl 2024 SRH vs RR Qualifier-2 Match Highlights: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అనే పాటను ఎవరూ మరిచిపోలేరు. అలాంటి ఘటనే రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఆట ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు చెపాక్ స్టేడియంలో ఎమోషన్స్ అటూ, ఇటూ, ఇటూ అటూ ఊగిసలాడుతూనే ఉన్నాయి.
మొదట్లోనే టాస్ ఓడిపోయిన హైదరాబాద్ అని చెప్పగానే అభిమానులంతా డీలా పడిపోయారు. రాజస్థాన్ అభిమానులందరూ కేరింతలు కొట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఒక రేంజ్ లో ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ మొదటి ఓవర్ లోనే పంచ్ హిట్టర్ అభిషేక్ శర్మ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి 12 పరుగులకి అవుట్ అయిపోయాడు.
వెంటనే స్టేడియంలో ఆనందాలు తారుమారయ్యాయి. అంతవరకు సిక్స్, ఫోరు కొట్టిన ఆనందం హైదరాబాద్ అభిమానుల్లో ఆవిరైపోయింది. అవుట్ అవగానే రాజస్థాన్ అభిమానులు కేరింతలు కొట్టారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య పాప ముఖం కూడా వాడిపోయింది.
హైదరాబాద్ ఫోరు, సిక్స్ కొడితే కావ్య ముఖం చూపించడం, అవుట్ అయిన వెంటనే, ఆ ఏడుపు ముఖం ఎలా ఉందో చూపించడం కెమెరామెన్ కి ఇదే పనిగా మారింది. ఇక హైదరాబాద్ వికెట్లు ఠపాఠపా దీపావళి టపాసుల్లా పైకి ఎగిరి, కిందకు పడుతున్నాయి.
ఫస్ట్ వికెట్ పడింది..టామ్ కొహ్లెర్ 10 పరుగులు చేసి వెనుతిరిగాడు. హైదరాబాద్ జట్టులో అందరికీ పిచ్ పరిస్థితి అర్థమైంది. ఆ ప్రకారం బౌలింగు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యశస్వి ఒక్కసారి బ్యాట్ ఝులిపించాడు. ఫటాఫట్ మని భువనేశ్వర్ బౌలింగులో 19 పరుగులు చేసి పారేశాడు. దీంతో రన్ రేట్ ఒక్కసారి పైకి లేచి, సమానమైపోయింది. మళ్లీ మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లినట్టే అనిపించింది.
దీంతో కావ్య పాప కళ్లల్లో విచారం.. మొఖం ఇలా పెట్టుకుని ఎటో చూస్తూ కనిపించింది. ఆ పక్కనే స్టాండులో ఒక చిన్నారి పాపని చూపించారు. తను ఎగిరి గంతులేస్తోంది.
సీన్ కట్ చేస్తే.. రాజస్థాన్ వికెట్లు ఠపఠపామని పడిపోయాయి. 139 పరుగులకి కథ ముగిసిపోయింది. దీంతో ఒక్కసారి స్టేడియంలో హైదరాబాద్ అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. కావ్య పాప ఆనందంతో గెంతులేసింది. అక్కడే ఉన్న తండ్రి కళానిధి మారన్ ని వెళ్లి సంతోషం పంచుకుంది.
ఇదిలా ఉండగా ఇంతకుముందు నవ్వుతు తుళ్లుతూ కనిపించిన చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఒకటే ఏడుపు 14 ఓవర్ దగ్గర నుంచి మొదలెట్టిన ఏడుపు చివరి వరకు కంటిన్యూ అయ్యింది. అలా నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. ఒకొక్కసారి తనుకు తానే సంభాళించుకుంటూ, నిగ్రహించుకుంటూ, కర్చీఫ్ తో తుడుచుకుంటూ చాలా అవస్థలు పడింది.
క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక ఎమోషన్ గేమ్.. భారతీయుల బ్లడ్ లోకి అంతగా వెళ్లిపోయింది. ఆనందం వచ్చినా తట్టుకోలేరు, దుఖం వచ్చినా తట్టుకోలేరు. అంత బలహీన మనసులైపోయారనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి.