Basara IIIT : మొన్న విద్యార్థుల ఆందోళన, ఆ తర్వాత విద్యార్థి ఆత్మహత్య.. నిన్న మత ప్రచారం…బాసర ట్రిపుల్ ఐటీని వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భయపడిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన అధికారులు…ఓ ఉన్నతాధికారిని, అటెండర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తమ దృష్టికి వచ్చిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.