Bus accident in telangana today(): హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. కల్వకుర్తి నుంచి హైదరాబాద్కు కారు వస్తోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బస్సు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం వాసుదేవ్పూర్ గేటు సమీపంలో జరిగింది. ప్రమాదానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతులు హైదరాబాద్లోని కర్మన్ఘాట్ వాసులుగా గుర్తించారు. 35 ఏళ్లగా శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, నిఖిల్(26), మణిదీప్ (25) అందులో ఉన్నారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన ముగ్గురి మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం వాసుదేవ్పూర్ గేటు సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కారు వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే… pic.twitter.com/TmcoHe2AQW
— BIG TV Breaking News (@bigtvtelugu) May 24, 2024