పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై వైష్ణో దేవికి యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలాలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ నుంచి వైష్ణో దేవి దర్శనం కోసం వీరందరూ మినీబస్సులో వెళ్తున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొంతమందిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న కొందరు వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కంటే ముందు ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులకు వివరించారు.