EPAPER

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!

Ambala Road Accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు!
7 Died and 25 Injured in Ambala Road Accident: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబాలా ఆస్పత్రికి తరలించారు.

 


పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై వైష్ణో దేవికి యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి వైష్ణో దేవి దర్శనం కోసం వీరందరూ మినీబస్సులో వెళ్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు బోల్తా.. పలువురు మృతి


ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొంతమందిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్న కొందరు వ్యక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కంటే ముందు ట్రక్కు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులకు వివరించారు.

Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×