Police Inquiry on TDP Pulivarthi Nani Case: తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని దాడి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీట్లను పరిశీలించారు డీఎస్పీ రవి మనోహరాచారి. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని విచారించారు. వీల్ చైర్లో ఆయన డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగానే నానిని విచారించినట్టు తెలుస్తోంది.
దాడి ఎలా జరిగిందనే నుంచి కీలక విషయాలు రాబట్టారు. మే 14న శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన దాడులకు కర్మ, కర్త, క్రియ అన్నింటికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కొడుకు మోహిత్రెడ్డి, రఘునాథ్రెడ్డి, భానుకుమార్రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారాయన.
విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అభ్యర్థి నాని, చెవిరెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఆరోపించారు. ఆయనకు దూరమవుతున్న అనుచరులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దాడుల వెనుకున్న ముసుగు దొంగలను బయటకు లాగాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు పోలీసులు కొందరు అమాయకులపై పెట్టిన కేసుల విషయమై చర్చించినట్టు చెప్పుకొచ్చారు.
Also Read: ఈవీఎం డ్యామేజ్ కేసు, పిన్నెల్లికి బిగ్ రిలీప్, అప్పటివరకు మాత్రమే
ముఖ్యంగా టీడీపీకి చెందిన 70 మంది కార్యకర్తలపై అన్యాయంగా 307, 435 సెక్షన్ల కింద కేసులు పెట్టారని వివరించారు నాని. తన గన్మెన్పై దాడి చేసిన ఘటనలో తిరుమలకు చెందిన ఓ డమ్మీ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. దాడులకు సుత్రధారులుగా వ్యవహరించిన వారిని తప్పనిసరిగా శిక్షించాలని పులవర్తి నాని డిమాండ్ చేశారు.