Summer Holidays will be extended: స్కూల్ సెలవుల విషయమై రాజ్ భవన్, విద్యాశాఖ తలపడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్ టైమింగ్స్ ను చేంజ్ చేసి పాఠశాలలను నడిపిస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, పాఠశాలల వేసవి సెలవులను పొడిగించాలంటూ రాజ్ భవన్ నుంచి రాష్ట్ర సీఎస్ కు తాజాగా ఉత్తరం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానికంగా కొంత చర్చ కొనసాగుతుంది.
ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనాల్లో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. అయితే, ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ హాలిడేస్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే 16న స్కూల్స్ తిరిగి పునప్రారంభమయ్యాయి. అయితే, అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో స్కూల్స్ సమయవేళల్లో మార్పులు చేసి స్కూల్స్ ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ భవన్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ ఉత్తరం అందింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాలల వేసవి సెలవులను మరికొన్ని రోజులు అనగా జూన్ మొదటి వరకు పొడిగించాల్సిందిగా రాజ్ భవన్ నుంచి సీఎస్ కు ఉత్తరం విడుదల అయ్యింది. సెలవులు పొడిగించడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలగుతుందని అందులో పేర్కొన్నారు.
Also Read: భిన్న వాతావరణం.. చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు
అయితే, రాజ్ భవన్ నుంచి ఉత్తరం అందడంతో స్థానికంగా కొంత చర్చ కొనసాగుతుంది. అయితే, సంబంధిత శాఖ సెలవుల విషయమై ఏ నిర్ణయం తీసుకుంటుందోననేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. గతంలో కూడా రాజభవన్, విద్యాశాఖ మధ్య ఈ వాతావరణం నెలకొన్నదని ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.