Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గర పడుతుండటంతో ఇండియా కూటమిలో అసహనం పెరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు తనను దూషిస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీహార్ లోని మహరాజ్ గంజ్ లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తుండటంతో వారంతా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు రాబోయే ఐదేళ్ల కోసం మరో సారి మోదీlr ఎన్నుకుంటారన్న విషయాన్ని విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం కేంద్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మరోసారి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.
Also Read: రాజీవ్ గాంధీ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆరోపించారు. యూపీలోని సిద్దార్థ నగర్ లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అవినీతి గురించి వెల్లడించారని గుర్తు చేశారు. తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని చెప్పారని అన్నారు. కానీ ప్రస్థుతం ఆ పరిస్థితి లేదు.. జన్ ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు ప్రజలకు చేరుతోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
#WATCH | Addressing a public meeting in Maharajganj, Bihar, PM Narendra Modi says, "…They(INDIA alliance) cannot tolerate that the people of the country are going to re-elect Modi for the next 5 years…" pic.twitter.com/sjDZav2f7b
— ANI (@ANI) May 21, 2024
#WATCH | Siddharthnagar: Uttar Pradesh CM Yogi Adityanath says "…During the Congress regime, the then Prime Minister used to say that 100 paise is sent but only 15 paise reaches down (to the public). This is not the situation today. Today you have a Jan Dhan account. The money… pic.twitter.com/ZE1FsrIox9
— ANI (@ANI) May 21, 2024