Attack on Family in Visakhapatnam for Vote to TDP: ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.
టీడీపీకి ఓటు వేసినందుకు తలలు పగలగొట్టారు!
విశాఖ: టీడీపీకి ఓటు వేసినందుకు వైసీపీ నేతల దాష్టీకం. బర్మా క్యాంప్ నూకాలమ్మ ఆలయం వెనుక ఉన్న ఇంట్లోని ఇద్దరు మహిళలు, యువకుడిపై ఈ రోజు విచక్షణా రహితంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు. తీవ్రగాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులు.… pic.twitter.com/3TfQhEyn91
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2024
Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!
అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గూండాలు ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఆడవారని చూడకుండా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.
This isn't just an assault on women, but an assault on democracy itself.
Sensing imminent defeat, YSRCP goons have been on a rampage across the state. In a distressing incident in the 68th ward of Akkireddipalem, two innocent women bore the brunt of this aggression. They were… pic.twitter.com/XJJmDrkOaW
— Lokesh Nara (@naralokesh) May 16, 2024