EPAPER

Man Kills Mother: దారుణం.. ఐరన్ రాడ్డుతో కొట్టి తల్లిని క్రూరంగా చంపిన కొడుకు..!

Man Kills Mother: దారుణం.. ఐరన్ రాడ్డుతో కొట్టి తల్లిని క్రూరంగా చంపిన కొడుకు..!

Man Killed His Mother in Andhra Pradesh: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రులను చిన్న చిన్న కారణాలకే పొట్టనపెట్టుకుంటున్నారు కొడుకులు. తాగేందుకు డబ్బివ్వలేదని, ఆస్తి పంపకాలు చేయలేదని, ఇంట్లో గొడవలు.. ఇలా రకరకాల కారణాలతో చంపేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల కారణంగా ఓ కొడుకు.. తల్లిని ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ ఘటన అనంతపురంలోని కంబదూరులో జరిగింది. వడ్డి వెంకటేష్ అనే వ్యక్తి వడ్డి సుంకమ్మ (45)ను ఇనుపరాడ్ తో కొట్టి హతమార్చాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకమ్మ తన భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తల్లిదండ్రుల గొడవతో విసిగిపోయిన వెంకటేష్ కోపంతో.. ఇనుపరాడ్ తీసుకుని సుంకమ్మ తలపై బలంగా కొట్టాడు. సుంకమ్మకు తీవ్రగాయాలై.. అక్కడికక్కకడే మృతి చెందింది. అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read: పల్నాడులో ఘోరం, ట్రావెల్ బస్సు ఢీకొట్టిన టిప్పర్, ఐదుగురు సజీవ దహనం


సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వెంకటేశ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గతేడాది జూన్ లో.. రాజేష్ (37) అనే వ్యక్తి తన అత్తను నరికి చంపాడు. తన భార్యను విడాకులకు ప్రోత్సహించిన కారణంగా.. విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ పై అత్తను నరికి చంపాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

Tags

Related News

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Bride on Sale Elopes: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Passengers Beat Railway Employee To Death: రైల్వే ఉద్యోగిని చితకబాది హత్య చేసిన ప్రయాణికులు.. ఏం చేశాడంటే?..

Gujarath insident: గణేశుని నిమజ్జనంలో అపశృతి.. నదిలో మునిగి 8 మంది మృతి

Big Stories

×