Man Killed His Mother in Andhra Pradesh: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిదండ్రులను చిన్న చిన్న కారణాలకే పొట్టనపెట్టుకుంటున్నారు కొడుకులు. తాగేందుకు డబ్బివ్వలేదని, ఆస్తి పంపకాలు చేయలేదని, ఇంట్లో గొడవలు.. ఇలా రకరకాల కారణాలతో చంపేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల కారణంగా ఓ కొడుకు.. తల్లిని ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ ఘటన అనంతపురంలోని కంబదూరులో జరిగింది. వడ్డి వెంకటేష్ అనే వ్యక్తి వడ్డి సుంకమ్మ (45)ను ఇనుపరాడ్ తో కొట్టి హతమార్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకమ్మ తన భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తల్లిదండ్రుల గొడవతో విసిగిపోయిన వెంకటేష్ కోపంతో.. ఇనుపరాడ్ తీసుకుని సుంకమ్మ తలపై బలంగా కొట్టాడు. సుంకమ్మకు తీవ్రగాయాలై.. అక్కడికక్కకడే మృతి చెందింది. అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: పల్నాడులో ఘోరం, ట్రావెల్ బస్సు ఢీకొట్టిన టిప్పర్, ఐదుగురు సజీవ దహనం
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వెంకటేశ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గతేడాది జూన్ లో.. రాజేష్ (37) అనే వ్యక్తి తన అత్తను నరికి చంపాడు. తన భార్యను విడాకులకు ప్రోత్సహించిన కారణంగా.. విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ పై అత్తను నరికి చంపాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.