Huge Fire at KIA Company in Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియో కార్ల అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దాదాపు 15 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.
అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..కియా అనుబంధ పరిశ్రమ ఎన్ఎల్ఏపీలో బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కార్లకు సంబంధించి హెడ్ లైట్లు, గ్లాసులు తయారు చేసే పరిశ్రమ ఇది.
సాయంత్రం కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో నిప్పురవ్వులు ఎగిరిపడ్డాయి. పక్కనే ఉన్న దుస్తులకు తొలుత మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల్లో యంత్రాలు ఇతర సామాగ్రి కాలిబూడిదయ్యాయి.
Also Read: Chandrababu SPG increased : బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?
కార్మికులు మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల ప్రభావానికి గాజు గ్లాసులు ఎగిరిపడ్డాయి. సమాచారం తెలియగానే పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. పెనుకొండ, హిందూపురం ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు కార్మికులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. నష్టం ఇంకా అంచనా వేయాల్సి ఉందని కంపెనీ ఉద్యోగులు చెప్పుకొచ్చారు.
Also Read: Court serious on Palnadu incidents: పల్నాడు ఘటన..కోర్టు సీరియస్, ఈసీతోపాటు
కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం…
శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటుచేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది…
ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీ లో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… pic.twitter.com/IozCrUrBo3
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2024