Groom Entry into Wedding Hall in the Scooter: ట్రెండ్ మారింది. గడుస్తున్న కాలంతో పాటు మనుషులు కూడా పరుగులు తీస్తున్నారు. ఏదైనా పని చేద్దాం అంటే చాలు అది అందరూ చేసేదే కదా. మనం ఎందుకు అలా చేయాలి. ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అంటూ మెదడుకు పదును పెట్టి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అన్నింటిలోను జరుగుతున్నా.. పెళ్లిళ్ల విషయానికి వస్తే మాత్రం మరింత ఫాస్ట్ గా ఆలోచిస్తుంటారు.
జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి కోసం ఎన్నో వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. ఏదో ఒక్కటి అయినా కొత్తగా ఉండాలని చూస్తుంటారు. అయితే పెళ్లి అంటే వధువు ఎంట్రీ చాలా స్పెషల్ గా, సర్ ప్రైజ్ గా ప్లాన్ చేస్తారు. ఎంట్రీ కోసం గుర్రాలు, వ్యాన్, లేదా కార్లను డెరకేట్ చేసి అందులో అదిరిపోయే లెవల్ లో వరుడి ఎంట్రీని ప్లాన్ చేస్తుంటారు.
తాజాగా ఓ వరుడు ఇచ్చిన ఎంట్రీ అందరిని ఆశ్యర్యపరిచింది. సాధారణంగా అయితే గుర్రాలు, ఏనుగులు లేదా కార్లు, జీపులు వంటి వాటిలో ఎంట్రీ ఇస్తారు. కానీ ఓ వరుడు ఇచ్చిన ఎంట్రీ వధువును ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రిక్ బైక్ పై వధువు ఒక్కసారిగా కనిపించడంతో వధువుతో పాటు వధువు తరుపున బంధువులు కూడా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. పారిశ్రామిక డిజైనర్ గా పనిచేస్తున్న దర్శన్ పటేల్ అనే వ్యక్తికి గత వారం రోజుల క్రితం వివాహం జరిగింది.
Also Read: Viral Video: ఆఖరికి దీన్ని కూడా వదిలిపెట్టదా.. దోమల బ్యాట్పై బ్రెడ్ టోస్ట్ చేసేసింది
అయితే తన పెళ్లి బరాత్ సందర్భంగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఉపయోగించాడు. ఈ క్రమంలో ఏథర్ స్కూటర్ పై వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే ఈ వీడియోపై ఏథర్ కంపెనీ సీఈఓ కూడా స్పందించారు. ఈ విషయం తమకు ముందే తెలుసు అని, తన వివాహంలో తమ కంపెనీ స్కూటర్ ఉపయోగించడం ఆనందంగా ఉందని అన్నారు. ఏథర్ రిజ్జా ఈవీ అనే బైక్ పై వరుడు ఎంట్రీ అదిరిపోయింది. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంట్రీ అనంతరం వరుడు వధువుతో కలిసి డ్యాన్స్ చేయడం కూడా వైరల్ అవుతోంది.
Horses in weddings are being replaced by Ather in @peakbengaluru 😂🦄 pic.twitter.com/rXgqFFXtxP
— Peak Bengaluru (@peakbengaluru) May 13, 2024